అధికారం కోసం ఎలాంటి అరాచకాలకైనా సిద్ధమైన పార్టీ వైసీపీ

         శ్రీకాకుళం, ఏప్రిల్ 07 (జనస్వరం) : అధికారం కోసం ఎలాంటి అరాచకాలకైనా పాల్పడే వైసీపీ నేతల చూపు ఇప్పుడు వృద్ధులు, వికలాంగులపై పడిందని జనసేనపార్టీ బూర్జ మండల అధ్యక్షుడు కొత్తకోట నాగేంద్ర ద్వజమెత్తారు. వైసీపీ పార్టీ స్వార్ధ రాజకీయాలకు తెరతీసి పేదల జీవితాలతో చెలగాటమాడుతుందని జనసేనపార్టీ నాయకులు, తూర్పు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షలు కొల్ల జయరాం ఆవేదన వ్యక్తం చేశారు. యంపీటీసి విక్రం మాట్లాడుతూ అసలే వేసవికాలం కాలం కావటంతో ఎండలు మండుతున్నాయని ఈ నేపధ్యంలో వైసీపీ నేతలకు కనికరం కూడా లేకుండా దుష్ట రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మరో నేత సేపేన రమేష్ మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక సంపద సృష్టితో మరిన్ని సంక్షేమ పథకాలు అమలచేసేందుకు కృషి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మల్లేశ్వరరావు, గేదెల వాసు, మామిడి సత్యన్నారాయణ, తులగాపు గౌతమ్, మజ్జి దిలీప్, గురుగుబిల్లి కోమల్, కొమరాపు ప్రసాద్ తులగాపూ మౌళి, తులాగాపు తిరుపతి, రుంకు అనంత, సివ్వాల సురేశ్, తులాగాపు నరేష్, కుప్పిలి చంటి, తులాగాపు శ్రీను, కుర్మాపు జోగారావు, పైడి మల్లేశ్వర రావు, కరణం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way