Search
Close this search box.
Search
Close this search box.

అధికారంలోకి రాబోయేది కూటమి ప్రజా ప్రభుత్వమే : జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు

• మహిళా విభాగం బలోపేతానికి కమిటీలు వేసాం

• రాబోయే ఎన్నికల్లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని, తిరుపతి ఎంపీగా వెలగపూడి వరప్రసాద్ లను కూటమి తరఫున అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం

       సర్వేపల్లి, మార్చి31 (జనస్వరం) :  సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గ వీర మహిళ అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని అధ్యక్షతన వీర మహిళ విభాగాన్ని బలోపేతం చేసేందుకు అన్ని మండలాల మహిళ కమిటీలు వేయడం జరిగింది. వెంకటాచలం మండల వీర మహిళ అధ్యక్షురాలిగా సందూరు సాయి శ్వేతా, మండల ఉపాధ్యక్షురాలిగా వలిపి కావేరి, ముత్తుకూరు మండల వీర మహిళ అధ్యక్షురాలిగా మన్నేపల్లి మస్తానమ్మ, పొదలకూరు మండల వీర మహిళ అధ్యక్షురాలిగా గురుపర్తి కామాక్షి రాకేష్ లను నియమించడం జరిగింది. అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వీర మహిళ విభాగాన్ని 25 మంది మహిళలతో కమిటీ వేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ వచ్చే నెల మొదటి వారంలోగా సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా మహిళ శక్తిని తయారుచేసి, భవిష్యత్తులో సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ వీర మహిళ విభాగం బలంగా ముందుకు తీసుకు వెళ్లడం జరుగుతుంది. వైసీపీ ఐదేళ్ల రాక్షస పాలనలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు విపరీతంగా జరిగాయి. రాబోయే ప్రజా ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పిస్తుంది. వైసిపి రాక్షస పాలనలో మహిళల హక్కులపై పోరాటం చేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  మహిళలకు అండగా నిలిచారు. అలాంటి మహిళా శక్తిని బలోపేతం చేయడమే జనసేన పార్టీ లక్ష్యం. పవన్ కళ్యాణ్ పై నమ్మకంతో నేడు సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మహిళలు ధైర్యంగా ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో వాళ్లందరిని కూడా ఉన్నత స్థాయిలో నిలబెట్టుకునే దానికి నా వంతు నేను కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నని తెలిపారు. కృష్ణా పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలిగా నియమితులైన నాగరత్నంని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరపున సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాగరత్నంకి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరెన్నో ఉన్నత స్థాయి పదవులను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, వీర మహిళ నాయకురాలు కంటే లక్ష్మి, జయసుధ, ముత్తుకూరు మండల ప్రధాన కార్యదర్శి రహీం, అశోక్, మస్తాన్, సుమన్, చిన్న, నవీన్, వెంకటాచల మండల కార్యదర్శి శ్రీహరి, చెంచయ్య, రామిరెడ్డి, పొదలకూరు మండల నాయకులు సంజు రాకేష్, మనుబోలు మండల నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way