Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ పతనానికి కౌంట్ డౌన్ మొదలైంది

      గుంటూరు ( జనస్వరం ) : రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికేలా ఈ నెల 17 వ తేదీన చిలకలూరిపేట సభ జరగనుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. దేశ ప్రధాని మోదీ , టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేనాని పవన్ కల్యాణ్ లు పాల్గొనే చారిత్రక సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ , బీజేపీ , జనసేన పార్టీలతోనే రాష్ట్రానికి స్వర్ణయుగం సాధ్యమన్నారు. వైసీపీ పాలనలో జరిగిన పాలనా విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్ణించుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఎప్పుడైతే మూడు పార్టీల పొత్తు కుదిరిందో అప్పుడే వైవీపీకి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. సభ అనంతరం వైసీపీ నేతలు అస్త్ర సన్యాసం చేయనున్నారని జోస్యం చెప్పారు. మోదీ , చంద్రబాబు , పవన్ ల నాయకత్వంలోనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు సాకారం కానుందన్నారు. వచ్చే ఆదివారం జరగనున్న సభకు టీడీపీ , బీజేపీ , జనసేన పార్టీ శ్రేణులతో పాటూ రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకునే ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని ఆళ్ళ హరి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way