ఇసుక నుండి కాసులు పిండుకుంటున్న వైసీపీ నాయకులు  : జనసేన రియా

    పాలకొల్లు ( జనస్వరం ) : రాష్ట్రాన్ని తవ్వి పారెయ్యడంలో వాళ్ళు ఉద్దండ పిండాలని జనసేన వీరమహిళ జనసేన రియా అన్నారు. ఆమె మాట్లాడుతూ  ఇసుక ర్యాంపుల్లో వేలాది లారీలు, వందలాది మంది కార్మికులు, పదుల సంఖ్యలో ప్రొక్లైయినర్ల ఇసుక తవ్వకాలు రాత్రింబవళ్ళు కొనసాగుతున్నాయి. లారీలు వెళ్ళేందుకు నదుల్లో ఏకంగా రోడ్లు నిర్మించారంటే అధికార పార్టీ వైసీపీ నాయకుల ఆగడాలు ఎంత తెగించాయో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. నదీ ప్రవాహానికి అడ్డంగా రోడ్డు వేయకూడదన్న నిబంధన ఉన్నా, దాన్ని తుంగలో తొక్కి సహజ సంపదను యధేచ్చగా దోపిడీ చేస్తున్నారు. బకాసురుడి ఆకలి అయినా తీరుతుందేమో కానీ అధికార పార్టీ నాయకుల ధన దాహం తీరేటట్లు లేదు. ధన దాహంతో భవిష్యత్‌ను తవ్వేస్తున్నారు. విచ్చలవిడి ఇసుల తవ్వకాలు భావితరాల అవసరాలకు, జల సంక్షోభానికి, పర్యావరణ విఘాతానికి ప్రధాన కారణం కాబోతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన జాతి సంపదను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు ఇసుక మాఫియాకు అండగా నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way