Search
Close this search box.
Search
Close this search box.

మృతుని కుటుంబానికి డాక్టర్ కందుల ఆర్థిక సహాయం

    విశాఖపట్నం ( జనస్వరం ) :  స్థానిక 35 వ వార్డులో మృతి చెందిన రామమూర్తి కుటుంబానికి దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అండగా నిలిచారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. వారికి ఎటువంటి సమస్య వచ్చిన తాను ముందు ఉండి ఒక కుటుంబ సభ్యుడిగా ఆదుకుంటానని చెప్పారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఆయన పలు వార్డులలో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 35వ వార్డులో పర్యటించి మృతిని కుటుంబానికి బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గ పార్టీ నాయకత్వ సమన్వయంతో ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో 35 వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు లంక త్రినాధ్, జనసేన నాయకులు రఘు,నగేష్,అశోక్, దక్షిణ నియోజకవర్గం యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way