జనసేనతోనే అవినీతి రహిత పాలన సాధ్యం

    రాజంపేట ( జనస్వరం ) : జనసేనతోనే అవినీతి రహిత పాలన సాధ్యమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, రాజంపేట జనసేన యువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు అన్నారు. సుండుపల్లె మండలంలోని మడితాడు పంచాయతీలోని పలు గ్రామాలలో బెస్తపల్లి, బైనేనిమాలల్లి కొని రెడ్డిగారిపల్లి, నడిం తురకపల్లి, జీకే రాచపల్లిలో 137వ రోజు పవనన్న ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రూపొందించిన మేనిఫెస్టోను ఇంటింటికి తిరిగి ప్రజలకు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, పేద బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ద్యేయంగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జనసేన అధికారంలోకి రావాలన్నారు. వైసిపి అరాచక పాలనను ప్రజలు దృష్టిలో పెట్టుకొని జరగనున్న ఎన్నికల్లో జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో చౌడయ్య, కిషోర్, జనసేన వీర మహిళలు జెడ్డా శిరీష, లక్ష్మమ్మ మాధవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way