వైసీపీ ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ

వైసీపీ

    నూజీవీడు ( జనస్వరం ) : నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో రమణక్కపేట గ్రామంలో బిసి కాలనీలలో వర్షం కారణంగా అధ్వానంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మీద జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు స్థానిక నాయలుకులతో కలిసి సందర్శించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలాలలో దాదాపు అన్ని ఏరియాలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ నిధులను వాడుకుంటూ గ్రామ అభివృద్ది, సమస్యలను గాలికి వదిలేసింది అని సర్పంచులు కూడా చేసేది ఏమి లేక చేతులెత్తేశారు. పంచాయితీరాజ్ శాఖ అధికారులు కూడా నిధులు లేవని మేము చేసేది ఏమి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం పంచాయితీలకు నిధులు మంజూరు చేసి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబుతో పాటు మండల గ్రామ నాయకులు ఉప్పే నరేంద్ర, వల్లూరి సింహాచలం, చిరంజీవి, తల్లిబోయిన సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way