రాతి ముఖ మండపానికి భూమి పూజ

భూమి పూజ

      తిరుపతి ( జనస్వరం ) : వికృతమాలలో వెలసియున్న శ్రీ సంతాన సంపద వెంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా నూతన రాతి ముఖ మంటపానికి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ భూమి పూజ చేశారు. ఆదివారం ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం కుటుంబ సమేతంగా రాతి మండపానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ 24 రాతి స్థంభాలతో నిర్మిస్తున్న మండపాన్ని వచ్చే వైకుంఠ ఏకాదశిలోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వికృతమాలలో శిధిలావస్థకు చేరుకున్న వెంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని జీర్ణోద్దరణ చేసే అవకాశాన్ని భగవంతుడు తనకు కలిగించాడన్నారు. శ్రీవారి ఆశీసులతో పాటు తమ అభిమాన నేత పవన్ కళ్యాణ్ సహకారంతో ఆలయంలో నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నామన్నారు. రాతి ముఖ మండపం నిర్మిస్తే ఆలయానికి మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు, వెంకటేశ్వర ప్రసాద్, శివ ప్రసాద్, మునికృష్ణయ్య, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొని దిగ్విజయం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way