ప్రమాద సూచికలు వేసి ప్రమాదాలు నివారించాలని దంపెట్ల శివ డిమాండ్

         అనంతపురం ( జనస్వరం ) : బత్తలపల్లి నుండి కదిరి వరకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న రోడ్డు వద్ద సరైన సూచిక బోర్డులు లేక వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారని శింగనమల జనసేన నాయకులు దంపెట్ల శివ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ తాను కదిరి వెళ్తుండగా మార్గమధ్యమంలో దంపేట్ల గ్రామ సమీపంలో సరైన సూచికలు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ఒక కారు అదుపు తప్పిందన్నారు. అందులో ఉన్న వృద్ధులకు స్వల్ప గాయాలయ్యాయని అన్నారు. తామే దగ్గర ఉండి ప్రథమ చికిత్స అందించి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి మానవతావాదాన్ని చాటారు. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని,  ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి సరైన సూచిక బోర్డులు, సత్వరమే రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way