పరిపాలించడం చేతకాకనే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు

ప్రతిపక్ష

     అనంతపురం ( జనస్వరం ) : టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని స్థానిక సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ మీదుగా ఆర్ట్స్ కళాశాల ఎదురుగా గల ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన వ్యక్తం చేశారు. టిడిపి అర్బన్ ఇంచార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో టిడిపి వారు చేపట్టిన శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని వారికి జనసేన పార్టీ తరఫున రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు  పెండ్యాల శ్రీలత సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిపాలించడం చేతకాక స్థాయికి మించి అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆధోగతిపాలు పట్టించి ప్రజల దృష్టిని మరలించడానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని దీనిని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన టిడిపి పార్టీలు కలసికట్టుగా పోరాటం చేసి వైకాపా రాక్షస పరిపాలనను అంతం ఒందించి ప్రజా ప్రభుత్వాన్ని స్తాపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యనిర్వహక ప్రధాన కార్యదర్శి  భవాని రవికుమార్ గారు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, వీర మహిళలు జనసేన పార్టీ జిల్లా, నగర కార్యవర్గ సభ్యులు, జనసేన,టీడీపీ పార్టీల నాయకులు జన సైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way