మహిళా రిజర్వేషన్ బిల్లు హర్షనీయం : జనసేన పార్టీ నేత సోమ రౌతు అనురాధ

అనురాధ

    వేమురు ( జనస్వరం ) : మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందటం హర్షనీయమని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమ రౌతు అనురాధ పేర్కొన్నారు. బుధవారం వేముల విలేకరులతో మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారని, అనేక సందర్భాల్లో వివిధ పార్టీలు మహిళా రిజర్వేషన్లు బిల్లుపై మాటలు వరకే చెప్పారు గానీ నేటి వరకు రూపు దాల్చలేదు అన్నార., ఈనాడు ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు పెట్టడం అభినందనీయమన్నారు. దీని ద్వారా మహిళలు చట్టసభల్లోనూ ఇతర రంగాల్లోనూ కూడా ఒక శక్తిగా ఎదిగేందుకు తోడ్పడుతుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు దేవ గౌడ ప్రధానిగా ఉన్న కాలంలోనే పార్లమెంటులో చర్చకు వచ్చిందని కానీ ఆనాడు కొన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించడం ద్వారా ఆగిపోయింది అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా కేంద్ర క్యాబినెట్ నేడు బిల్లు ఆమోదింపబడటం మహిళలు గర్వించదగిన విషయమని అనురాధ పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా మహిళలు రాజకీయంగా మరింత ఎదిగి రాజ్యాధికారంలో పాలుపంచుకునే అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ, రాజకీయంగా ఎదిగేందుకు తోడ్పాటునిస్తుందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇందుకోసం ప్రత్యేకతలు చూపుతారని అనురాధ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో కూడా పూర్తిగా ఆమోదం పొందని దీమ వ్యక్తం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way