అరకులోయ ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వరా భాధితులకి పరామర్శ.

   అరకు ( జనస్వరం ) : నియోజకవర్గం కేంద్ర పరిధిలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం 11 గంటల సమయమున జనసేన పార్టీ ఆధ్వర్యంలో డుంబ్రిగుడ మండలం జనసేన పార్టీ మండల నాయకులు కొన్నేటి చిన్న రావు గారిని ( జ్వర బాధితుడు ) మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో మంచనపడ్డ జ్వర బాధితులకు జనసేన బృందం వారి వద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం ఈ సందర్భంగా అక్కడున్నటువంటి బాధితులతో ముఖాముఖి వారికి ఉన్నటువంటి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. అన్ని ఉన్నప్పటికీ బాధితులకు వేడి నీళ్లు సౌకర్యం కల్పిస్తే బాగుంటదని జనసేన దృష్టికి తీసుకు వచ్చారు. దీనికై స్పందిస్తూ జనసేన పార్టీ (మాజీ ఎంపీటీసీ) సాయిబాబా దురియా. పార్లమెంట్ వర్కింగ్ కమిటీ నాయకుడు లక్ష్మణ్ రావు. ఉమ్మడి జిల్లా కార్య నిర్వహణ కమిటీ సభ్యులు ప్రధాని సురేష్. ముత్యం ప్రసాద్ తదితరులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సంబంధిత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, తక్షణమే జ్వర బాధితులకు వేడి నీళ్లు సౌకర్యం కల్పించాలని సూచించారు. దీనికై వేడి నీళ్లు బాధితులకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జన సైనికులు మహేష్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way