Search
Close this search box.
Search
Close this search box.

బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన జనసేన నాయకులు

– హాజరైన జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జి ఉయ్యాల ప్రవీణ్
       సూళ్లూరుపేట, (జనస్వరం) : స్థానిక బీసీ బాలికల వసతి గృహాన్ని జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జి ఉయ్యాల ప్రవీణ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ వెనుకబడిన కులాల పిల్లలకి నేను మేన మామని అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి ఈ హాస్టల్ లో మీ పిల్లల్ని ఒక్క పూట ఉంచగలరా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అదే విధంగా గడప గడప తిరుగుతున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకి సూళ్లూరుపేట మెయిన్ బజారులో శిధిలావస్థలో ఉన్న ఈ బీసీ బాలికల వసతి గృహం కనపడలేదా..? విరిగిపోయిన తలుపులు, కిటికీలు ఎప్పుడు పడిపోతుందో తెలియని భవనం పైకప్పు, తలుపులు లేని బాత్రూంలు, ఆడబిడ్డలకు లేని రక్షణ, 111 మంది బీ.సీ బాలికలకు ఉన్నది 2 గదులు మాత్రమే. పొద్దున లేచినప్పటినుంచి పడుకునే వరకు అన్నీ ఆ రెండు గదులలోనే అని ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడితే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసే మహిళా మంత్రులు, వైసిపి నాయకురాలు ఇవి చూసి వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాలికలకు అన్నివిధాలుగా న్యాయం జరిగే వరకు, జనసేనపార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రమణ, ఉపాధ్యక్షుడు శ్రీహరికోట జగదీష్, నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way