విద్యుత్ షాట్ సర్క్యూట్ వల్ల చనిపోయిన ఉద్యోగి నరేంద్ర కుటుంబానికి అండగా జనసేన

విద్యుత్

      శ్రీకాళహస్తి ( జనస్వరం ) : శ్రీకాళహస్తి ఆలయంలో సానిటైజేషన్ లో పని చేసే నరేంద్ర అనే ఉద్యోగి నిన్నటి రోజు విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా చనిపోవడం చాలా బాధాకరం. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు ఈరోజు ఉదయం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి వెళ్లి మార్చురీ లోని నరేంద్ర మృత దేహాన్ని చూసి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర కుటుంబ సభ్యులు ఆలయ అధికారుల నుండి ఎలాంటి హామీ,బరోసా ఇవ్వలేదని చనిపోవడానికి గల కారణాలు సి.సి టీవీ విడియోలు బయట పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సబ్యులకు జనసేన పార్టీ పూర్తి అండగా ఉంటుందని, తక్షణమే ఆలయ ఈఓ మరియు చైర్మన్ గారు ఆ కుటుంబానికి నష్ట పరిహారాన్ని 25 లక్షలు అయినా ప్రకటించాలని, వారి కుటుంబంలో ఒకరికి ఆలయంలో పెర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే బాధ్యత తీసుకుని కుటుంబాన్ని ఆదుకోవాలని, అలా కాదని కుంటి సాకులతో తప్పించుకోవాలని చూస్తే జనసేన పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉండి పోరాడుతామని బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు తోట గణేష్, వేణు గోపాల్, వెంకట రమణ యాదవ్, గణేష్ , చెంచు ముని, వెంకటేష్ , గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way