Search
Close this search box.
Search
Close this search box.

డ్రైనేజీ వ్యవస్థను రిపేర్ చేయించే విషయంలో ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలి

ప్రభుత్వం

         శేరిలింగం పల్లి ( జనస్వరం ) : నియోజవర్గ ఇంచార్ట్ Dr. మాధవ రెడ్డి గారి ఆధ్యర్యంలో లింగంపల్లి అండర్ పాస్ మరియు చందానగర్ అండర్ పాస్ బ్రిడ్జీలను సందర్శించటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలకుంట్ల తారకరామా రావు గారు ప్రొద్దున లేస్తే హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని ప్రగల్భాలు పలికే ప్రభుత్వ పెద్దలు వాస్తవానికి సామాన్యులు, బీద, బడుగు బలహీన వర్గాల జీవన విధానాల్లో మెరుగు పడటం కోసం అయితే ఎటువంటి కృషి చేయడం లేదు. మన శేరిలింగం పల్లి నియోజక వర్గం నుండి అయితే పన్నుల రూపంలో రాష్ట్రంలో అధిక ఆదాయం మన నియోజకవర్గం నుండి చెల్లిస్తున్నాం, కాని శేరిలింగం పల్లి అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు అయితే కేటాయించటం లేదు. మధ్యతరగతి ప్రజలకు కనీస అవసరాలను తీర్చటంలో కూడా ప్రభుత్వం విఫలమౌతున్నది. లింగంపల్లి మరియు చందానగర్ అండర్ పాస్ ల ద్వారా రోజుకు వేలాది మంది ప్రయాణిస్తున్నారు. అయితే వర్షాలు వచ్చినప్పుడల్లా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఇదే విషయాన్ని వినతి పత్రాల ద్వారా ఇప్పటికే 4, 5 సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయినప్పటికీ, అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడటం లేదు, వేసవి కాలం లో సైతం ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకు వెళ్ళినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం చూస్తే ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న శ్రద్ద ఎంటో తేటతెల్లం అవుతుంది. ఎన్నికల సమయాల్లో కాకుండా ఇటువంటి సమయాల్లో శేరిలింగం పల్లి MLA గారు నియోజకవర్గం అంతా తిరిగితే ప్రజలు సమస్యలు తెలుస్తాయని హితవు పలికారు. వెంటనే లింగంపల్లి మరియు చందానగర్ అండర్ పాస్ ల డ్రైనేజ్ వ్యవస్థను రిపేర్ చేయించి, శాశ్వత పరిష్కారం కొరకు ఆలోచనలు చేయాలని, ఈ సమస్యకు పరిష్కారాలను చూపాలని డిమాండ్ చేసారు. లేని యెడల రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఆధ్యర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శేరిలింగంపల్లి నాయకులు బి.అరుణ్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, హనుమంతు నాయక్, పుష్ప, స్వామి మరియు ఇతర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way