Search
Close this search box.
Search
Close this search box.

సంక్షేమ పథకాలు పేరు చెప్పి ప్రజలను సోమరపోతులను చేస్తున్న జగన్ రెడ్డి

జగన్ రెడ్డి

        శృంగవరపుకోట ( జనస్వరం ) : ఈ సమావేశం ఉద్దేశించి జనసేన నేత వబ్బిన సన్యాసి నాయుడు ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పేరు చెప్పి ప్రజలను సోమరపోతులను చేస్తున్నారని శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఒబ్బిన సన్యాసినాయుడు మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఎస్ కోటలో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పేర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ, అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా, ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా తాకట్టు పెట్టే పరిస్థితికి దిగజారారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులు, విద్యుత్తు, రవాణా చార్జీలను అమాంతంగా పెంచి పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజల జీవన ప్రమాణ స్థాయి కుంటుపడేలా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ, ప్రభుత్వ భూముల దోపిడీ వంటి రకరకాల దోపిడీలను చేస్తూ, ప్రజలకు మసి పూసి మారేడు కాయను చూపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసిపి పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టేందుకు అఖిలపక్షంతో కలిసి జూన్ 30వ తేదీన కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way