“మన ఇల్లు – మన జనసేన” కార్యక్రమం నిర్వహించిన రోసనూరు సోమశేఖర్

మన ఇల్లు - మన జనసేన

         సూళ్ళూరుపేట ( జనస్వరం ) : సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం మాంబట్టు పంచాయితీలో సుమారు 180 పైగా కుటుంబాలను సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ తడ మండల కార్యదర్శి ఈదూరు కాశీ ఆధ్వర్యంలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ స్థానిక సమస్యలను ప్రజలను నేరుగా అడగగా డ్రైనేజ్ వ్యవస్థ, అంతర్గత సిసి రోడ్లు నిర్మించాలని, త్రాగు నీరు లాంటి పలు సమస్యలు జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చి, సామంతులకు ధనవంతులకు మాత్రమే న్యాయం జరుగుతుంది, సామాన్యులకు న్యాయం జరగడం లేదు, వర్షం వస్తే మునిగే మాంబట్టు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది అని స్థానికులు వాపోయారు. అధికారులతో పరిష్కార దిశగా చర్చిస్తామని తెలిజేయయడం జరిగింది, అలాగే జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామాభివృద్ధి దిశగా బలమైన అడుగులు వేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పాలనలో మార్పు తీసుకురావాలి అన్న కోణంలో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024 లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తడ మండల ప్రధాన కార్యదర్శులు చేని ముని శేఖర్ మరియు పులి దిలీప్ కుమార్, స్థానిక జనసైనికులు ఈదూరు కుమార్, సంజీవ్, నరేంద్ర, వెంకీ, సురేష్, రవి వర్మ, లోకేష్, కిషోర్ తదితరులు పాల్గొని పవనన్న రావాలి పాలన మారాలి అంటూ నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way