జగనన్నకు చెబుదాం – చెప్పినా పరిష్కారం అవట్లేదాని జనసేన నాయకుల ఆవేదన

జగనన్నకు చెబుదాం

              నూజీవీడు ( జనస్వరం ) :  జగనన్న కి చెబుదాం అంటూ ప్రజలకి ముఖ్యమంత్రిగారు మీ ప్రాంతంలో సమస్యలు తన దృష్టికి తీసుకురమ్మని పిలుపునిచ్చిన సందర్బంగా నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు ముసునూరు మండల రమణక్కపేట గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం విజ్ఞప్తి చేశారు. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తమ పరిధిలో ఉన్న ఇంజనీర్ గారు సంబందిత రోడ్ల నిర్మాణం కోసం ఎస్టిమేట్లు వేసి పై పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు పంపించడం జరిగిందని అన్నారు. పాశం నాగబాబు మాట్లాడుతూ ఇంకా భాధ్యత ఇక వైసిపి పార్టీ పైన, స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ గారి పైన ఉంది. ఈ మాత్రం చొరవ స్థానిక ఎమ్మెల్యేకి ఉండుంటే చింతలపూడి ఎత్తిపోతలు, మెడికల్ కాలేజ్, పారిశ్రమిక వాడ, నూజివీడు-విజయవాడ నాలుగు వరుసల రహదారిలాంటి పెద్ద పనులు ఎప్పుడో పూర్తయ్యేవి అని అన్నారు. కనీస చొరవ చూపని వారు, తమ ప్రాంత అభివృద్దికి, మౌళిక సదుపాయాల కల్పనకు చొరవ చూపనోళ్ళు, నోరు తెరిసి నిధులు అడిగి మంజురు చేయించుకోనోళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతున్నారు కానీ ఆయా ప్రాంతాలు ఇప్పటికీ వెనుకబడే ఉండిపోతున్నాయని వాపోతున్నారు. ఇదే విధంగా నియోజకవర్గంలో స్థానిక జనసేన నాయకులతో కలిసి తమ సమస్యలు అధికారులకు తెలియచేయడం జరుగుతుందని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way