పవన్ కళ్యాణ్ ను కించపరుస్తూ వైసీపీ ఏర్పాటు చేసిన బ్యానర్లు తొలిగించాలి

పవన్ కళ్యాణ్

    గూడూరు ( జనస్వరం ) : గూడూరు పట్టణంలో వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్ ఫోటో అభ్యంతకర రీతిలో ఉందని వెంటనే ఫ్లెక్సీలు తొలిగించాలని గూడూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కర్త తీగల చంద్రశేఖర్ డిమాండ్ చేసారు.  జనసేన పార్టీ ఆధ్వర్యంలో మునిసిపల్ ప్రత్యేక అధికారి ఆర్‌డి‌ఓ కిరణ్ కుమార్, సీఐ దశరదరామ రావు, మునిసిపల్ మేనేజర్ కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పట్టణంలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టి ఆందోళనకరమైన పరిస్థితులను నెలకొల్పేందుకే వైసీపీ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణమాలు పట్టణంలో జరగకుండా మంచి వాతావరణం నెలకొల్పే దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జనసైనికుల మనోభావాలు కించపరిచేల ఏర్పాటు చేసిన బ్యానర్లు వెంటనే తొలగించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. అనంతరం పట్టణ అధ్యక్షులు ఇంద్రవర్ధన్ కుమార్ మాట్లాడుతూ గూడూరులో రాజకీయ పార్టీలను కించపరిచే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఇప్పటివరకు లేదని, దీని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉందన్నారు. ఫ్లెక్సీలు తొలగించకపోతే ప్రతిగా వైసీపీ నాయకుల ఫ్లెక్సీ లను ఏర్పాటు చేయాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్సులు విష్ణు, వంశీ, సూర్య ప్రతాప్, రఘు, కార్యదర్శులు శంకర్, ఓంకార్, సాయి, పాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way