సోమశిల ప్రాజెక్టు ఆఫ్రాన్ పనులను వెంటనే పూర్తి చేయాలి

సోమశిల

       నెల్లూరు ( జనస్వరం ) : సోమశిల ప్రాజెక్టు వద్ద కోట్ల రూపాయలతో జరుగుతున్న ఆఫ్రాన్ పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని జన సేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ కోరారు. ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలు ముందు వర్షాలు కారణంగా డ్యామ్ ముందు భాగము 20 నుంచి 30 అడుగులు గోతులు పడ్డాయి. భారీ వర్షాలు కారణంగా డ్యామ్ ముందు నిర్మాణం పనులు కోసం గత ఏడాది ఫిబ్రవరి నెలలో సాయికృష్ణ సంస్థ 117 కోట్లతో టెండర్ దక్కించుకుంది. ఈ ఆఫ్రాన్ పనులు మార్చ్ నెలలో ప్రారంభం అయిన ఏడాది కాలం దాటిన ఇప్పటివరకు పూర్తి కాకపోవడం వైసిపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. ఆఫ్రాన్ పనులు చేయటంలో జలవనరులు అధికారులు నిర్లక్ష్యమా లేక గుత్తేదారుల బిల్లు కోసంనిర్లక్ష్యమా అని తెలిపారు. అనంతరం ఆఫ్రన్ పనులు వెంటనే పూర్తి చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎడమ వైపు ఉన్న రిటేనింగ్ వాల్ ఎత్తు ఎడల్పు పెంచాలని నది పరివాహక ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా రాబోయే రోజుల్లో వచ్చే వర్షాకాలంలో దీనిని పూర్తి స్థాయిలో చేయాని యెడల ప్రాజెక్టు ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కార్యదర్శి లింగా బత్తిన హరీష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way