గుంటపల్లిలో ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు

గుంటపల్లి

      పాయకరావుపేట (జనస్వరం): మండలంలోని గుంటపల్లి లో శుక్రవారం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంధర్భంగా పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు విచ్చేసి అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గెడ్డం కన్నబాబు, యువ నాయుకులు గెడ్డం చైతన్య, మండల విద్యాశాఖ అధికారి కాకాడ నాగేంద్ర గాంధీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way