ప్రమాదంలో మరణించిన జనసైనికుని జ్ఞాపకార్థకంగా రక్తదానం చేసిన జనసైనికులు, గ్రామస్తులు

రక్తదానం

             పెందుర్తి ( జనస్వరం ) : కోడూరు గ్రామ జనసేన పార్టీ క్రియాశీలక మెంబర్ క్రీ.శే బొబ్బరి మోహన అప్పలనాయుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా స్వర్గస్తులైనారు. వారి మిత్రమండలి, గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో తాసుబల్లి ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటుచేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదాతలకు పెందుర్తి నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ గారు చేతుల మీదుగా సర్టిఫికెట్స్, మొక్కలు ఇవ్వడం జరిగింది. శ్రీకాంత్ గారు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ప్రమాదవశాత్తు మరణించిన బొబ్బర మోహన్ గారి పేరు మీద వారి మిత్రమండలి, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో సుమారు 100 మంది రక్తం దానం చేయడాని హర్షించవలసిన విషయం అని అన్నారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరిసా నర్సింగ్, బల్రెడ్డి ప్రసాద్, శంకర్ నాయుడు, గోపి, గవరా శ్రీను, రాడి పెంటారావు, మరియు స్థానిక జనసేన పార్టీ నాయకులు ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way