బొడ్డేపల్లి గేటు వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి పేడాడ రామ్మోహన్ డిమాండ్

రామ్మోహన్

            ఆమదాలవలస ( జనస్వరం ) : పొందూరు మండలం బొడ్డేపల్లి రైల్వే గేటు సమీపంలో నిర్మించిన అండర్ పాస్ లో రాకపోకలకు అంతరాయం ఏర్పడిన విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అండర్ పాస్ లో భారీ ఎత్తున నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కావలి, వాల్తేరు, పనసపేట తదితర ప్రాంతాల ప్రజలు, శ్రీకాకుళం జిల్లాలోని బెలమాం, లొద్దలపేట, తాడివలస, గండ్రేడు, లత్సయ్యపేట, గోరింట, గోకర్ణపల్లి, వెంకంపేట తదితర గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో నిరంతరం శ్రీకాకుళం పట్టణానికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అండర్ పాస్ వరకు వచ్చి మరలా వెనుకకు వెళ్లి పొందూరు మీదుగా శ్రీకాకుళం చేరడానికి కొన్ని గంటల సమయాన్ని వృధాచేసుకొనే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పదుతుంది. దీంతో రైల్వే అధికారులను తిట్టుకుంటూ ఊసురోమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అండర్ పాస్ లో చేరిన నీరు నాగావళి నదిలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినప్పటికీ అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి కాకపోవడంతో ఈ తీవ్ర సమస్య ఏర్పడుతుందని ప్రయాణికులు రైల్వే అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని పేడాడ రామ్మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు పైడి మురళి మోహన్, మండల నాయకులు పొన్నాడ బాలకృష్ణ, యశ్వంత్, నాయుడు, రాజు,కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way