అనాధ వృద్ధుడుకి అంత్యక్రియలు చేసి మానవత్వం చాటిన గుడివాడ పట్టణ జనసైనికులు

గుడివాడ

      గుడివాడ ( జనస్వరం ) :  పట్టణ స్థానిక నీలామహల్ రోడ్డులో గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచం మీదే జీవిస్తున్నా పిల్లి లక్ష్మణరావు గారు మృతి చెందడంతో నా అనేవాళ్ళు ఎవరు లేక చేతులో డబ్బులు లేక అతని భార్య బాధపడటంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జన సైనికులకు తెలియజేయగా వెంటనే స్పందించి అన్ని తామే కులామతాలతీతంగా అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటడంతో అక్కడ ఉన్న ప్రజలు జనసైనికులును అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ(Rk) మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంతో గుడివాడ పట్నంలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు నా అనేవాళ్ళు లేని వారికి మేము తోడుగా ఉండి అన్ని మేమే కులామతాలతీతంగా ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేస్తున్నామని తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గుడివాడ పట్టణంలోని సేవా కార్యక్రమలు చేస్తున్నామని అలాగే చాలామంది అభిమానం అంటే పెద్దపెద్ద బ్యానర్లు కట్టి బైక్ ర్యాలీలు చేస్తూ పాలాభిషేకలు చేస్తూ హడావుడి చేస్తూ ఉంటారు, కానీ మా నాయకుడు మాకు నేర్పింది సమాజానికి దేశానికి సేవ చేయడమే నిజమేనా అభిమానం అని మా కార్యకర్తలకు తెలియజేశారు అలాంటి నాయకుడికి మేము జనసైనికులుగా పనిచేయడం చాలా గర్వంగా ఉందని తెలియజేశారు. ఇంతటి పుణ్యకారానికి విచ్చేసిన మా సోదరులు జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారికి, గంట అంజి గారికి, నూనె అయ్యప్పకు, మరియు జన సైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way