Search
Close this search box.
Search
Close this search box.

లాభసాటిగా వ్యవసాయ రంగం జనసేనతోనే సాధ్యం : మనుబోలు గణపతి

మనుబోలు గణపతి

       సర్వేపల్లి ( జనస్వరం ) : “ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” కార్యక్రమం 36 వ రోజు ముత్తుకూరు మండలం,దమ్మయ్య పాలెం గ్రామంలో జరిగింది. ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యం కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని, దమ్మయ్య పాలెం గ్రామంలో జనసేన నాయకులు ఇంటింటికీ చేరి కరపత్రాలు పంచారు. జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ టీడీపీ హయాంలో, ఇప్పుడు వైసీపీ అధికారంలో మన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వ్యవసాయ శాఖ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించినా కూడా నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదు. వ్యవసాయ శాఖ నిర్వర్తిస్తూ ఆ శాఖకి న్యాయం చేయలేకపోయారు. కానీ రైతే రాజు అంటారు, కానీ ఈ ప్రభుత్వంలో ఇన్ని ఆత్మహత్యలు ఎలా జరిగాయి? చనిపోయిన కౌలు రైతులకు ఏం న్యాయం చేయలేకపోయారు, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సినిమాలో సంపాదించిన తన కష్టార్జితాన్ని 3000 మంది చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను ఇంటికి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చి ఆదుకున్నాడు. రైతులకు న్యాయం చేసే ఇలాంటి నాయకుడిని వదులుకున్నామంటే వ్యవసాయ రంగం ఎప్పయికి అభివృద్ధి చెందదు. జనసేనపార్టీ అధికారంలోకి వస్తే లాభసాటిగా వ్యవసాయ రంగం మెరుగైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తుందని తెలియజేసారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి గారి ఆధ్వర్యంలో జరిగింది.తాండ్ర శ్రీను,సతీష్ గౌడ్ పాల్గొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way