జీవో నెం.1ను రద్దు చేసుకోవాలి

జీవో నెం.1

                విజయవాడ, (జనస్వరం) : జీవో నెంబర్.1 ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేసుకోవాలని, ఈ జీవో ప్రజాస్వామ్యం పై కత్తి పెట్టడమేనని, సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు నిలువెత్తు నిదర్శనమని, సీఎం జగన్ ది బ్రిటిష్ డిఎన్ఏ అని, అందుకనే దేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన తదుపరి కూడా ఆ పాలకుల జీవోలను నేడు అమలు చేస్తున్నారని, జగన్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నందున ప్రతిపక్షలా గొంతు నొక్కేందుకే ఈ జీవో జారీ చేశారని, ఇటువంటి దుర్మార్గమైనటువంటి జీవోను రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ఈ జీవోను రద్దు చేసేంతవరకు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు కలిసి ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఎంబీవీకే పౌర హక్కుల సంఘం వారు నిర్వహించిన సదస్సుకు జనసేన పార్టీ తరఫున మద్దతు తెలియజేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావుతో కలసి పోతిన వెంకట మహేష్ జీవో నెంబర్ వన్ రద్దు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way