నెల్లిమర్ల జనసేన నాయకురాలు లోకం మాధవి ఆధ్వర్యంలో చింతపల్లిలో మన ఊరిలో జన వారధి

లోకం మాధవి

         నెల్లిమర్ల ( జనస్వరం ) : ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే మన ఊరిలో జన వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జనసేన నియోజకవర్గ నాయకురాలు లోకం నాగమాధవి తెలిపారు. మండలంలోని చింతపల్లిలో జనసేన ఆధ్వర్యంలో మన ఊరిలో జనవారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార మహిళలు తమ గోడును ఆమె ముందు వినిపించారు. జెట్టీ నిర్మిస్తే వలసలను నివారించవచ్చని తెలిపారు. 2019లో అగ్నిప్రమాదంలో 25 ఇళ్లు కాలి బూడిదయ్యాయని, ఇంతవరకూ పరిహారం అందలేదని బాధితులు వాపోయారు. అనంతరం ఆమె స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు జమ్మరాజు, కారి అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way