సాటిలైట్ సిటీ గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు తదేకం ఫౌండేషన్ మరియు జనసేన నాయకులు గృహ నిర్మాణం

తదేకం ఫౌండేషన్

        రాజమండ్రి ( జనస్వరం ) : సాటిలైట్ సిటీ గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు తదేకం ఫౌండేషన్ మరియు జనసేన పార్టీ నాయకులు సహకారంతో గృహ నిర్మాణం చేసిన స్థానిక జనసైనికులు.   జనసేనపార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా గృహప్రవేశం చేయడం జరిగింది. అనంతరం జరిగిన సభలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారి సమక్షంలో వందమంది యువతీ యువకులు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గేష్ గారు మాట్లాడుతూ పేదవాడి కంట కన్నీరు తుడవడానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి ద్యేయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర అధ్యక్షులు వై శ్రీను, రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు చప్పా చిన్నారావు, జాము సత్యనారాయణ, భాష, మట్టపర్తి నాగరాజు, మరియు సాటిలైట్ సిటీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way