తాడిపత్రిలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

తాడిపత్రి

            తాడిపత్రి ( జనస్వరం ) : 74 గణతంత్ర దినోత్సవ సందర్బంగా తాడిపత్రిలో జెడ్‌పి‌హెచ్‌ఎస్ పాఠశాల నందు జనసేన నాయకులు, రాష్ట్ర చిరంజీవి యువత తరపున కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థులకు ఆటలపోటీలు పెట్టారు. గెలిచిన వారికి మెడల్స్  మరియు గిఫ్ట్‌లు రాష్ట్ర చిరంజీవి యువత పట్టణ అధ్యక్షులు, జనసేన నాయకులు ఆటో ప్రసాద్ గారు ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడుతూ తెల్లదొరల పాలన నుండి విముక్తి పొంది, దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే భ్రమలో ఈ దేశ ప్రజలు జీవిస్తున్నారు.. కానీ నేడు దేశంలోడా.బి.ఆర్.అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ నేటి నల్లజాతి పాలకులు నియంత పాలన అందిస్తున్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రజల హక్కు కాలరాస్తు ప్రజల సంపదను కొల్లగొడుతూ వారి స్వేచ్ఛ స్వాతంత్రం లేనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారన్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్తూ దేశ అభివృద్ధి యువత చేతులోనే ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్లు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way