అన్ని స్థానాల్లో గెలుస్తామన్న నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి రండి

• సీఎంకు గాజువాక జనసేన నేతల సవాలు 

    గాజువాక, (జనస్వరం) : నర్సీపట్నం సభలో ముఖ్యమంత్రి మతిభ్రమించి మాట్లాడారని జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీని చూసి భయపడే ముఖ్యమంత్రి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారన్నారు. జగన్ రెడ్డి తుగ్లక్ పాలనతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ప్రజలు నానా ఆబ్బందులు పడుతున్నారని తెలిపారు. గాజువాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మీద వస్తున్న ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికి ముఖ్యమంత్రి మాయమాటలు చెబుతున్నారన్నారు. 175కి 175 స్థానాలు గెలుస్తామన్న నమ్మకం ఉంటే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాలు విసిరారు. మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, గవర సోమశేఖర్ రావు, కాద శ్రీను, ముమ్మను మురళి, పిడుగు బంగారు రాజు, వీరమహిళలు గొన్నా రమాదేవ, కరణం కళావతి, లక్ష్మీ, అల్లూరి రామారావు, పి. వసంత్, కోటిని గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way