Search
Close this search box.
Search
Close this search box.

జనవరి 12న శ్రీకాకుళంలో పవనన్న ముందు యువ గళాన్ని వినిపించే యువశక్తి భారీ బహిరంగ సభ

– పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

     నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 233వ రోజున 11వ డివిజన్ సరస్వతి నగర్ స్రవంతి స్కూల్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ జనవరి 12న శ్రీకాకుళంలోని రణస్థలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో లక్షలాది యువతీయువకుల నడుమ “యువశక్తి” పేరుతో భారీ బహిరంగ సభ జరుగనుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆ సభలో అధ్యయనం చేస్తారని అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం వలన ఆ ప్రాంత యువతీయువకులు కోల్పోయిన అనేక అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ గారి ఎదుట తమ గళాన్ని ప్రసంగం రూపంలో వినిపించే అవకాశం పలువురు యువతీ యువకులకు కల్పించడం జరుగుతుందని, ఆ అవకాశం పొందేందుకు జనవరి 5 నుండి 8 వరకు 08069932222 నెంబర్ కి ఫోన్ చేసి రాష్ట్రంలో తాము అధ్యయనం చేసి పలు సమస్యల పైన, అంశాలపైన వాయిస్ రికార్డ్ రూపంలో వివరించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way