సరైన సబ్సిడీ పథకాలు, ప్రభుత్వ ప్రోత్సాహం లభించక రైతులు క్షీణించిపోతున్నారు : చిలకం మధుసూదన్ రెడ్డి

చిలకం మధుసూదన్ రె

       ధర్మవరం ( జనస్వరం ) : జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలోని సిరిగారిపల్లి, సిలోళ్ళపల్లి ,దేవరగుట్టపల్లి గ్రామాల రైతులతో పర్యటిస్తూ రైతులు పడుతున్న కష్టాల గురించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలుసుకున్నారు. అనంతరం మీడియా ముఖ్యంగా మాట్లాడుతూ గ్రామాల్లోని పంట పొలాల్లోకి వెళ్ళి రైతులను, కూలీలను పలుకరించి వారి సమస్యలను, కష్టాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. అక్కడి రైతుల బాధలు చెప్పడం వర్ణనాతీతమని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రైతులకు మరింత అన్యాయం జరుగుతోందన్నారు. సరైన సబ్సిడీ పథకాలు, ప్రభుత్వ ప్రోత్సాహం లభించక రైతులు క్షీణించిపోతున్నారని అలాగే గతంలో సబ్సిడీ కింద డ్రిప్ పైపులు అందించేవారని, ఇపుడు అవి కూడా అందించలేని పొలంలో పర్యటిస్తున్నప్పుడు సుంకర సుజాత తన గోడును వెల్లబోసుకుని కన్నీటి పర్యంతమైందని చిలకం మధుసూదన్ రెడ్డి ఈ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way