ధర్మవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను ఎగుర వేస్తాం

• జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి 

     ధర్మవరం, (జనస్వరం) : ధర్మవరం నియోజకవర్గంలో జనసేనపార్టీ జెండాను ఎగరవేస్తాం అని జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. సేవ్ ధర్మవరం కార్యక్రమాన్ని పట్టణంలోని ఆరవ వార్డు కేశవ నగర్ లో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి హాజరయ్యారు. చిలకం మధుసూదన రెడ్డికి వార్డు ప్రజలు అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. వారు ఇంటింటికి వెళ్లి గూండాలు రౌడీల నుండి ధర్మవరం పట్టణాన్ని మరియు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ మహిళలకు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ధర్మవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను రానున్న ఎన్నికలలో కచ్చితంగా ఎగురవేస్తామని వారు తెలిపారు. ప్రజలందరూ ఒక్కసారి జనసేన పార్టీకి తనకు అవకాశం ఇవ్వాలని వారు తెలిపారు. మహిళలు మిమ్మల్ని(చిలకం మధుసూదన రెడ్డిని) ఎమ్మెల్యేగా చూడాలంటూ చిలకం మధుసూదన రెడ్డిని కోరారు. కచ్చితంగా 2024 అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఎమ్మెల్యే అవుతారని కచ్చితంగా మీకు ఓటు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తామని మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆరవ వార్డు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way