మద్దికెర మండలంలో జనసేన పార్టీలోకి సి.జి రాజశేఖర్ ఆధ్వర్యంలో 20 కుటుంబాల చేరికలు

మద్దికెర

             పత్తికొండ ( జనస్వరం ) : మద్దికేర మండలం నాయకులు, గద్దల రాజు, అశోక్, గద్దల అజయ్, కంబగిరి, లవన్న, ఆధ్వర్యంలో పత్తికొండ జనసేన నాయకులు సిజి రాజశేఖర్ సమక్షంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి 20 మంది బీసీ, ఎస్సీ కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. అనంతరం సిజి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ఓసి కులాలకు సంబంధించిన సల్మాన్, వెంకటరామిరెడ్డి, మహబూబ్ బాషా, C.మద్దన్న, S.హరికృష్ణ, నరేష్, ఎండే రాము, గోపి, భరత్, అనుమేష్, లవన్న, వంశి, కాశిం, రామచంద్ర, , ఉదయ్ మహేష్, శంకర్, వెంకట్, రామంజి, మరియు తదితరులు సోదరులు పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. రాజకీయంగా ఆర్థికంగా సమాజంలో ఎదుగుదలను కొరకు బడుగు బలహీన వర్గాలను పల్లకిలో ఎక్కించడానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారని తెలియజేశారు. పత్తికొండ నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి జనసేన పార్టీతోనే సాధ్యమవుతుంది. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, అధికారంలోకొస్తే కనుక బడుగు, బలహీన వర్గాలకు జనసేన పార్టీలో కీలక పదవులు కూడా ఆయా వర్గాలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పత్తికొండ నియోజకవర్గంలో పత్తికొండ టౌన్ నందు రోడ్డు వెడల్పు చేపట్టాలని గత 30 సంవత్సరాలు నుంచి ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న అదిగో ఇదిగో అంటూ కొలతలతో కాలక్షేపం చేస్తూ ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గంలో రోడ్డు వెడెల్పు కార్యక్రమంలో వెంటనే చేపట్టాలని జగన్ రెడ్డిని కోరుచున్నామన్నారు. నిజంగా ట్రాఫిక్ సమస్య ఉన్నచోట వదిలేసి ఇప్పటం ప్రజలపై కక్ష సాధింపు తప్ప వేరే ఆలోచన లేదన్నారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారు రోడ్డు వెడల్పు చేపడతామని పూజ కార్యక్రమాలు చేసి ఇప్పటివరకు రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేపట్టలేదు.  మీ గ్రామాలలో మీ వార్డులలో సమస్యలు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. వారి తరఫున పోరాడుదాం ప్రజల హృదయాల్లో పవన్ కళ్యాణ్ గారు నిలిచిపోయేలా మనమంతా కలిసి పోరాడుదాం, విజయం సాధిద్దాం అని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way