ఎర్రకట్ట మరమ్మత్తులకు మోక్షం ఎప్పుడు? జనసేన నాయకులు పోతిన వెంకట మహేష్

      విజయవాడ, (జనస్వరం) : ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ, ప్రమాదాల బారిన పడుతున్న విఎంసి అధికారులు & రైల్వే అధికారులు స్పందించట్లేదని జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి ఏడాదిగా ఎర్ర కట్టకు కనీస మరమ్మత్తులు చేయించడంలో వైఫల్యం చెందారని ఆయన అన్నారు. వైసిపి కార్పొరేటర్లు పూర్ణ, చలపతిరావు ఈ సమస్య పై కనీస దృష్టి సారించకుండా స్థానిక ప్రజల ఇబ్బందులను గాలికి వదిలేశారని అవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ స్థానిక డివిజన్ అధ్యక్షులు సోమీ గోవింద్, నాయకులు ఆది తదితరులతో కలిసి పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ శనివారం ఉదయం ఈ ప్రాంతాన్ని సందర్శించి స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకుని తొందరలోనే ఈ సమస్య పరిష్కారం కోసం జనసేన పార్టీ తరఫున కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way