జనసైనికునికి అండగా నిలిచిన ఆమదాలవలస జనసేన నాయకులు

    ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస నియోజకవర్గం ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన జన సైనికుడు ధవళ సీతారాం ఇటీవల ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు వారిని పరామర్శించి, జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే సీతారాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఆ పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కలిగి ఉండటంతో రామ్మోహన్ ఆయా భీమా సంస్థల నుండి జనసేన పార్టీ తరపున 37,520 వేల రూపాయలు విడుదల అయ్యేలా బాధ్యత వహించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఆ కుటుంబానికి వారి గ్రామంలో స్థానికుల సమక్షంలో అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేనపార్టీలో ప్రతి కార్యకర్తకు అన్ని వేళల్లో పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస రోటరీ క్లబ్ అధ్యక్షులు పాత్రుని.పాపారావు, పేడాడ హేమలత, SVS పాఠశాల ప్రిన్సిపాల్ ప్రతాప్, అప్పలనాయుడు, సరుబుజ్జిలి జడ్పీటీసీ అభ్యర్థి పైడి. మురళీమోహన్, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way