విద్యుత్ ఘాతంతో మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

               శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) ఆధ్వర్యంలో ఉప్పిన వలస గ్రామములో షాక్ తో ఇటీవల చనిపోయిన యువకుడు కుటుంబానికి జనసేన పార్టీ తరఫున 10000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ కుటుంబానికి ఎల్లపుడూ అండగా ఉంటామని జనసేన పార్టీ తరఫున భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మౌళి, శ్రీను, సంగం నాయుడు, నరేష్, నారాయణరావు, వినోద్ మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో ఆర్థికంగా సపోర్ట్ చేసిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. 

See also  తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని అధికారులను విన్నవించిన జనసేన నాయకుడు నగిరి పాటి. మహేష్ గారు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి