ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆపద్భాంధవుడిలా ఆదుకున్న జనసేన నాయకులు భవానీ రవికుమార్

భవానీ రవికుమార్

            అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిధ్యాల గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి గత ఏడాది జూలై నెలలో రోడ్డు ప్రమాదం లో తన కుడి కాలును కోల్పోయాడు. వైద్య ఖర్చులకు దాదాపుగా 5 లక్షల వరకు అప్పు చేశాడు. కనీసం సొంత ఇల్లు లేక రోడ్డు పక్కన ఒక చిన్న గుడిసెలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న సమయం లో గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త ఈ విషయాన్ని రాష్ట్ర నాయకులు భవానీ రవికుమార్ గారి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన భవానీ రవికుమార్ గారు వారి వైద్య ఖర్చులకు, కుటుంబ పోషణకు గాను ప్రతి నెల 10వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరుపున ఎటువంటి సహాయం అందడం లేదు. ఏ అధికారి కానీ, ఏ నాయకుడు ఎవరూ మమ్మల్ని పట్టించు కోవడం లేదు. మేము ఈరోజు ఇబ్బందుల్లో ఉన్న మాకు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు భవానీ రవికుమార్ గారు ఆపద్భాందవుడుగా వచ్చి మాకు అండగా నిలిచారని బాధితుడు అనిల్ భార్య చెప్పుకొచ్చారు. అందులో భాగంగా ఈనెల వైద్య ఖర్చులకు నిమిత్తం 20,000 వేల రూపాయలను బాధితులకు ఉరవకొండ మండలం అధ్యక్షుడు చంద్ర శేఖర్, అజయ్ , అబ్దుల్ ద్వారా బాధితుడికి అందచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way