కాపు JAC నాయకులు దాసరి రాము గారిని సత్కరించిన జనసేన నాయకులు

     పత్తికొండ, (జనస్వరం) : కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం జనసేన నాయకులు రాజశేఖర్ నిస్వార్థ జనసైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కాపు JAC దక్షిణ భారత నాయకులు దాసరి రాముని, అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠని జనసేన శ్రేణులు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాపు నాయకులు దాసరి రాము మాట్లాడుతూ అనునిత్యం పేద, బడుగుబలహీన వర్గాల కోసం పరితపించే జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకొని పీడిత వర్గాలకు రాజ్యాధికారం అందించేలా కాపు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఐక్యమత్యంతో కృషి చేయాలని వ్యాఖ్యానించారు. జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందడుగు వేయాలంటే కచ్చితంగా నిస్వార్థ నాయకుడైన పవన్ కళ్యాణ్ ని 2024లో ముఖ్యమంత్రిగా చేసుకుని తీరాల్సిందే అని, అంతవరకూ నిస్వార్థ జనసైనికులు అందరూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యే విధంగా పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way