మంత్రి RK రోజా పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించిన తిరుపతి జనసేనపార్టీ వీర మహిళలు

రోజా

       తిరుపతి ( జనస్వరం ) : మంత్రి RK రోజా పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన విమర్శలకు ఘాటుగా  ప్రెస్ ముఖంగా స్పందించిన తిరుపతి జనసేనపార్టీ వీర మహిళలు. వారు మాట్లాడుతూ తనని గెలిపించిన నగిరిలో రోజా చేసిన అభివృద్ధి ఏంటో అందరికి తెలియజేయాలి. నగిరి ప్రజలను రోజాను మోసం చేస్తున్నారు. ఆమెను గడప కూడా తొక్కనీయడం లేదన్నారు. రోజా నువ్వు నోరు అదుపులో పెట్టుకో.. పవన్ కళ్యాణ్ నాయకుడే కాదని రోజా అన్న మాటలు హాస్యాస్పదంగా ఉంది.. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన‌పార్టి ముందు ఉంటుంది.. ప్రజల పక్షాన పోరాడే పార్టి ఏదైనా ఉంది అంటే‌ అది కేవలం జనసేనపార్టీనే అని గుర్తించుకోవాలన్నారు. రాష్ట్రంలో గంటకు ఓ అత్యాచారం జరుగుతుంటే ఆపలేని వైసీపి జనసేన పార్టిపై మాట్లాడుతున్నారు. దిశ యాప్ పెట్టినా రాష్ట్రంలో అత్యాచారాలు అదుపులోకి రావడం‌ లేదు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని దద్దమ్మ జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపి అధికారం‌లోకి రాకపోతే రోజా ఎక్కడ ఉండేదో గుర్తు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ను విమర్శించే హక్కు రోజాకు లేదు. పవన్ కళ్యాణ్ న్ని దత్త పుత్రుడు అని అంటే రోజాకు మర్యాద లేదని హెచ్చరించారు. రోజా జగన్మోహన్ రెడ్డికి దత్త పుత్రిక.. అంబేద్కర్ పై గౌరవం ఉంటే, ఆయన ఆశయాలను వైసీపి అమలు చేయాలి.. విమర్శ అంటే విధాన పరంగా ఉండాలి కానీ దిగజారుడుగా ఉండకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆకేపాటి సుభాషిని, ఆకుల వనజ, కీర్తన, లతా, లక్ష్మి పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way