దళిత హక్కుల పోరాటసమితి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు

     విజయనగరం, (జనస్వరం) : రాష్ట్రంలో దళితులు, మహిళలపై నిరవధికంగా జరుగుతున్న హత్యలు, అఘాయిత్యాలను నిరసిస్తూ దళిత హక్కుల పోరాట సమితి(DHPS) విజయనగరం జిల్లా వారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర దళిత ఐక్య వేదిక అధ్యక్షులు, ప్రజాగాయకుడు ఆదాడ మోహనరావు, జనసేన పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), యువనాయకుడు లోపింటి కళ్యాణ్  పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై, హత్యలపై పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వానిదే. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అభం శుభం తెలియని పసికందులను, మహిళలపై కొందరు కామాంధుల చేతుల్లో బలైపోతున్నారని, ఇటువంటి ఉన్మాదులకు సరియైన రీతిలో కఠినమైన శిక్షలు అమలుచేసే చట్టాలు ప్రభుత్వం తీసుకురావాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way