గ్రామాల్లో పర్యటిస్తున్న పాలకొండ జనసేన నాయకులు

పాలకొండ

            పాలకొండ ( జనస్వరం ) : వీరఘట్టం మండలం, కీమ్మి గ్రామంలో పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు పర్యటించారు. ఈ సందర్భంగా రైతులను కలిసి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన రైతు భరోసా యాత్ర లో బాగంగా 3000 మంది కౌలు రైతులు చనిపోయారని, వాళ్ల కుటుంబాలను నేరుగా పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారని అన్నారు. అలాంటి నాయకుడిని కాపాడు కోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అలాగే వివిధ విషయాలు గురించి వివరించి వాళ్లకు అవగాహన కల్పించారు. అలాగే వృద్ధులతో మాట్లాడుతూ సామాన్యులకు న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అలాగే జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అని ఆయన అన్నారు. గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేసి భావితరాల భవిష్యత్ కు శ్రీకారం చుట్టాలని ప్రజలకు వృద్ధులకు యువతకు ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way