ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలకు అండగా జనసేనపార్టీ

జనసేనపార్టీ

          నెల్లూరు ( జనస్వరం ) : పంట నష్టపోయి, అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేనపార్టీ అండగా నిలుస్తుందని మర్రిపాడు మండల జనసేనపార్టీ అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి అన్నారు. NRI జనసైనికుడు మైలవరపు రాజా ఆధ్వర్యంలో  టీం పిడికిలి వారు రూపొందిచిన గోడ ప్రతులు, ఆటో స్టిక్కర్లును మర్రిపాడు మండల కేంద్రంలో మండల అధ్యక్షురాలు చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అప్పులుపాలై ఆత్మహత్య చేసుకున్న ఒక్కో కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయల చోప్పున 3 వేల మంది రైతులను ఆదుకునేందుకుపవన్ కళ్యాణ్ 30 కోట్ల సొంత నిధులను సమకూర్చడం జరిగిందన్నారు. ఇప్పటికే మూడు జిల్లాలోని కౌలు రైతు కుటుంబాలకు సాయం అందించడం జరిగిందని ఆత్మహత్యకు చేసుకున్న ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి సాయం అందించడం జరుగుతుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల కోసం చేస్తున్న ఓదార్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ గోడ ప్రతులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.  జనసేనపార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా టీం పిడికిలి వారు చేస్తున్న సేవలు వెళకట్టలేనివి అని అమె తెలిపారు.  ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఈరుపోతు ఉదయ్, మండల కార్యదర్శులు కన్నెమరకల హరి కృష్ణ, కోక్కంటి రమేష్, మండల నాయకులు పెనుమాది నరసింహ, చిన్నా జనసేన పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way