అగ్ని ప్రమాదంలో కాలిపోయిన కట్టెల డిపోలను పరిశీలించిన అనంతపురం జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య

    అనంతపురం, (జనస్వరం) : జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు, అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ ఆదేశాల మేరకు స్థానిక అనంతపురం నగరంలోని రమణ, రమేష్ థియేటర్ సమీపంలో నిన్న ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన కట్టెల డిపో కుటుంబాలను జనసేన నాయకులు పరామర్శించారు. ఈ ప్రమాదంలో మేదర నారాయణ, మేదర గంపన్నల కట్టెల డిపోలకు పూర్తిగా మంటలు వ్యాపించి కాలిపోవడం జరిగింది. అలాగే దాని ప్రక్కనే ఉన్న సల్మాన్ ఖాన్ యొక్క అరటికాయల మండిలో మంటలు వ్యాపించి ఆస్తినష్టం కలిగింది. ఈ ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని సందర్శించి, వారి కుటుంబాలను జనసేన నాయకులు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి ఇండ్ల కిరణ్, నగర ఉపాధ్యక్షులు గ్రందే దివాకర్, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేశు, కమటం వెంకటనారాయణ, రోళ్ల భాస్కర్, KLS చోటు, ధరాజ్ బాషా, నగర కార్యదర్శి అంజి, సంపత్, పవన్, అశోక్, సంతోష్, హరీష్, మల్లి, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way