అనంతసాగరం మండలంలోని సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతి

             నెల్లూరు ( జనస్వరం ) : అనంతసాగరం మండలం పాత దేవరపల్లి బిట్-1 పంచాయతీ పరిధిలోని పలు సమస్యలను సచివాల సచివాలయంలో పంచాయతీ సెక్రెటరీ గారికి అనంతసాగర్ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్  వినతిపత్రం అందించారు. గ్రామంలోని ప్రధాన సమస్యలైన దేవరపల్లి గ్రామంలోని మెయిన్ రోడ్డు పక్కనే సైడ్ కాలువ పూడిక తీసి పారిశుద్ధ్యం చేపట్టి, బ్లీచింగ్ పిచికారి చేయాలని వీధి దీపాలు కొన్ని కొన్ని స్తంభాలు దీపాల వెలగటం లేదని, తూర్పు వీధిలో సైడ్ కాలవలు నిర్మించాలని కోరారు. SC, ST కాలనీలో త్రాగడానికి మంచినీళ్లు రావడంలేదని వెంటనే పరిష్కరించాలని కోరారు.  అలాగే సైడ్ కాలవలు సిమెంట్ రోడ్డు నిర్మించాలని, గ్రామంలోని మంచినీళ్లు అన్ని వీధులకు కు సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్, మాబాష, మస్తాన్ వలీ, ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు.