ఆటిజం డిజార్డర్ తో బాధపడుతున్న 6 యేళ్ళ బాలుడుకు జనసేన పార్టీ ఆర్ధిక సహాయం

    శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం నియోజకవర్గం దమ్మల వీధి 40వ వార్డులోని నివాసముంటున్న కొండా మూర్తి మరియు వనజ దంపతులు కుమారుడు కొండా సోహిత్ పుట్టినప్పటి నుంచి ఆటిజం వ్యాధితో బాధపుతున్నాడు. థెరపీ సెషన్స్ కి నెలకు 30 నించి 40 వేలు వరకు ఖర్చు అవుతుందని, బ్యానర్ లు కట్టుకుని జీవనం సాగించే తమకు చికిత్స చేయించే ఆర్థిక పరిస్థితి లేదని ఆ దంపతులు దాతలను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కామేష్, తేజ ఆస్ట్రేలియా జనసేన NRI విభాగంలో కీలకంగా పనిచేస్తున్న సనపల సంజయ్ కు పరిస్థితి వివరించగ, సొహిత్ కు 20వేలు రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందించారు. శ్రీకాకుళం జనసేన నాయకులు ఉదయ్, గురుప్రసాద్ అధ్వర్యంలో సోహిత్ కు సహాయాన్ని అందించారు. తమ కుమారుడి చికిత్సకు అండగా నిలిచినందుకు మూర్తి దంపతులు జనసేన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నవీన్, ప్రదీప్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way