కార్యకర్తలకు కొండంత అండగా జనసేన పార్టీ

   తిరుపతి, (జనస్వరం) : చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు A. సాయి యశ్వంత్ కి గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడం జరిగింది. గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందడం జరిగింది. గతంలో సాయి జనసేన పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవడం వలన ఈరోజు జనసేన పార్టీ తరపున అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 24,512 రూపాయల చెక్కును తిరుపతి జనసేనపార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ క్రియాశీలక సభ్యుడికి అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జిల్లా నాయకులు రాజేష్ యాదవ్, కీర్తన, అరుణ, బాల పాల్గొన్నారు.

See also  జల వనరుల శాఖ మంత్రిగా అంబటి నీవు "అరసున్నా"