సంజీవయ్య ఆశయ సాధనకు అందరూ పనిచేయాలి :- పిఠాపురం జనసేన నాయకులు సత్యప్రసాద్

    పిఠాపురం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గములో  దామోదరం సంజీవయ్య గారి శతజయంతి సందర్భంగా  జనసేన నాయకులు సత్యప్రసాద్    ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయనది చెరగని స్థానం. నీతి, నిజాయితీకి నిలువుటద్దం. పల్లె నుంచి ఢిల్లీకెదిగిన రాజకీయ మేధావి. ఎన్నో పదవులను అలంకరించడమే కాకుండా ఆ పదవులకు వన్నె తెచ్చిన మహా నాయకుడు దామోదరం సంజీవయ్య గారని అన్నారు. అలాగే ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం. రిక్షాలో అసెంబ్లీకి వెళ్లిన నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ మరియు తొలి దళిత ముఖ్యమంత్రి, ఆదర్శ నాయకుడు, నిరాడంబరుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారు ఎనలేని ప్రజాసేవను గుర్తు చేసుకుంటూ.. బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ దామోదరం సంజీవయ్య గారి జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way