ఆదోనిలో జనసేనపార్టీలోకి భారీగా చేరికలు

        ఆదోని ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆదోని ఎస్ సి కాలనీకి మరియు పెద్దతుంబలానికి చెందిన 50 కుటుంబాలు జనసేనపార్టీలోకి చేరారు. ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఆయన మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. పార్టీలోకి జాయిన్ అయిన వారికి జనసేనపార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురేష్, మహబూబ్, షైక్, అలీ, రాజు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way