తాడేపల్లి మండలంలో జనసేనపార్టీ నాయకులు ఆత్మీయ సమావేశం

     తాడేపల్లి, (జనస్వరం) : తాడేపల్లి కొలనుకొండ గ్రామంలో జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షుల సామల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తాడేపల్లి మండల జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయశేఖర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర చేనేత విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపేలక్ష్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గా చూడాలని ఆవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ పని చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన జరుగుతుందని ఈ పాలనకు చరమగీతం పాడ వలసిన సమయం వచ్చిందని అన్నారు. అలాగే పలువురు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి మరియు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి విభాగం మెంబర్ చవ్వాకుల కోటేష్ బాబు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రావిరామా, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, చేనేత వికాసం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, దుగ్గిరాల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఈమని గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి పసుపులేటి సాయి చైతన్య, సీనియర్ నాయకులు దాసరి శివనాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way